PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పూజా ఫిక్స్‌

1 min read

సినిమా డెస్క్​ : అతడు, ఖలేజా లాంటి సూపర్‌‌ హిట్‌ కాంబో తిరిగి 11ఏళ్లకు మళ్లీ రిపీట్‌ కానుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు – డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో హ్యాట్రిక్ మూవీ తెరకెక్కడానికి సన్నాహాలు రెడీ అయ్యాయి. మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 28’ అనే వర్కింగ్ టైటిల్‌ని అనౌన్స్‌ చేస్తూ హీరోయిన్‌ని, టెక్నికల్‌ టీమ్‌ని కూడా ప్రకటించారు. హీరోయిన్‌గా పూజా హెగ్డే అంటూ ఫ్యాన్స్‌కి సర్‌‌ప్రైజ్‌ ఇచ్చారు. గతంలో మహేష్ తో ‘మహర్షి’ చిత్రంలో నటించిన పూజా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో అరవింద సమేత వీర రాఘవ, అల వైకుంఠపురములో వంటి చిత్రాల్లో వర్క్ చేసింది.
శ్రీమతి మమత సమర్పణలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇదొక పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ అని డిఫరెంట్ డైమెన్షన్స్ లో ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. ‘సర్కారు వారి పాట’ షూటింగ్‌ కంప్లీట్ అయిన తర్వాత ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చనున్నారు. స్టార్ క్యాస్టింగ్ – టాప్ టెక్నిషియన్స్ ని ఈ ప్రాజెక్ట్ కోసం తీసుకున్నారు మేకర్స్. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు ట్వీట్ చేస్తూ.. ”సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజును పురస్కరించుకుని మేము మీకు #SSMB28 యొక్క సూపర్ స్క్వాడ్ ను అందిస్తున్నాము. త్రివిక్రమ్ మంత్రముగ్ధమైన కథ త్వరలో సెట్స్ పైకి రానుంది” అని పేర్కొన్నారు.

About Author