వర్షాకాలంలో విద్యుత్ తో జర భద్రం తీసుకోవాల్సిన జాగ్రత్తలివే!!
1 min read
పాణ్యం , న్యూస్ నేడు: ఎప్పుడెప్పుడు రుతుపవనాలు వస్తాయా అని ఎదురు చూస్తున్న కాలం రానే వచ్చింది. ఈసారి రుతుపవానలు మే నెలలోనే రోహిణి కార్తిలో ముందుగానే రాష్ట్రంలోకి ప్రవేశించాయి.వర్షాకాలం ప్రారంభమైంది. రాష్ట్రంలో చెదురుమదురుగా వర్షాలు పడుతున్నాయి.ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.ముఖ్యంగా కరెంట్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి.రహదారులపై వెళ్లేటప్పుడు జాగ్రత్తగా మ్యాన్ హోల్స్ ను, కరెంటు పోల్స్ గమనించుకొని వాటికి దూరంగా వెళ్ళటం మంచిది. వర్షాకాలంలో అజాగ్రత్తతో ప్రాణాల మీదకు తెచ్చుకోకుండా పాటించవలసిన జాగ్రత్తలు ఏమిటి? అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.వర్షాకాలంలో విద్యుత్తు ప్రమాదాల బారిన పడకుండా కాపాడుకోవడం కోసం కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలి. ముఖ్యంగా మహిళలు బట్టలు ఆరేసుకునే తీగకు విద్యుత్ తీగ తగలకుండా ఉండేలా చూసుకోవాలి.తడి చేతులతో కరెంటు స్విచ్ లు ఆన్, ఆఫ్ చేయకూడదు. ఇంట్లో ఎక్కడైనా విద్యుత్ తీగలకు జాయింట్స్ ఉంటే వాటిని ఒకసారి ఎలక్ట్రీషియన్ తో మార్పించుకోవాలి. రహదారి వెంట ఉన్నటువంటి విద్యుత్ పోల్స్ ను పొరపాటున కూడా తాకకూడదు.విద్యుత్ తీగ సర్వీస్ వైర్ కు సపోర్ట్ గా ఉండే జి వైర్ ప్లాస్టిక్ తొడుగు ఉండేలా చూసుకోవాలి.విద్యుత్ తీగలు ఎక్కడైనా షార్ట్సర్క్యూట్ అవుతున్నట్టు గమనిస్తే వెంటనే మెయిన్స్ ఆఫ్ చేసి విద్యుత్ అధికారులకు సమాచారం ఇవ్వాలి. తెగి పడిపోయినా, ఎత్తు తక్కువగా ఉన్న కరెంటు తీగలను తాకకూడదు. రోడ్డుపైన విద్యుత్ తీగలు తెగి పడి పోయినట్లుగా గమనిస్తే వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించాలి.తెగిపడిన విద్యుత్ తీగలను తాకకూడదు. కనీసం వాటి దగ్గరగా కూడా ఉండకూడదు.ఎవరికైనా విద్యుత్ షాక్ తగిలినట్లయితే వారిని కాపాడటానికి పొరపాటున కూడా ఐరన్ రాడ్స్ వాడకూడదు. చెక్క లేదా ప్లాస్టిక్ తో చేసినటువంటి వస్తువులను మాత్రమే ఉపయోగించాలి. ఇక వర్షాకాలంలో ఈ జాగ్రత్తలు తీసుకొని విద్యుత్తు మన పాలిట ప్రాణాంతకంగా మారకుండా చూసుకోవలసిన అవసరం ప్రతి ఒక్కరి పైన ఉంది.