NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రైవేట్ పాఠశాలల పుస్తకాల వ్యాపారం, అక్రమ ఫీజు దోపిడీలను అరికట్టాలి

1 min read

ఏఐఎస్ఎఫ్ డిమాండ్                                

పత్తికొండ, న్యూస్​ నేడు: పత్తికొండ పట్టణంలో నడుస్తున్న ప్రైవేట్ పాఠశాలలో యదేచ్ఛగా సాగిస్తున్న పుస్తకాల వ్యాపారం, అధిక ఫీజుల దోపిడీలను అరికట్టాలని ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి శివ జిల్లా విద్యాధికారులను కోరారు. ఈ మేరకు సోమవారం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థుల బృందం స్థానిక ఎస్టీ జోసెఫ్ స్కూలు లో తనిఖీలు చేపట్టారు. ప్రైవేట్ విద్యా సంస్థలపై ప్రభుత్వం ఎన్ని నిబంధనలు విధించినప్పటికీ ప్రైవేటు స్కూల్ యాజమాన్యం రేఖాతరు చేస్తూ, విద్యార్థుల తల్లిదండ్రుల నుండి వివిధ రూపాలలో అక్రమ ఫీజులు వసూలు చేస్తున్నారని ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి శివ చెప్పారు. స్థానిక మండల విద్యాధికారులకు ఈ విషయమై ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పత్తికొండ ఎస్టి జోసెఫ్ స్కూల్లో ఏఐఎస్ఎఫ్ నాయకులు తనిఖీ చేయగా విద్యార్థులు ఫీజు కడితేనే పుస్తకాలు ఇస్తామని లేకపోతే ఇవ్వమని విద్యార్థులను విద్యార్థుల తల్లిదండ్రులను ఎస్టి జోసెఫ్ యాజమాన్యం ఇబ్బందికి గురిచేస్తుందని అన్నారు. తాము చేపట్టిన తనిఖీల్లో భాగంగా విచ్చలవిడిగా పుస్తకాల వ్యాపారం నడుపుతూ విద్యను వ్యాపారంగా మార్చే పరిస్థితిలో పత్తికొండ ప్రైవేట్ విద్యా సంస్థలు ఉన్నాయని ఈ విషయం బట్టబయలైందన్నారు. సంబంధిత మండల విద్యాశాఖ అధికారులకు తెలిపిన చర్యలు ఏమాత్రం తీసుకోవడం లేదని అన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో జరుగుతున్న దోపిడీ గురించి విద్యాశాఖ అధికారులకు తెలిపినప్పటికీ  ఎంఈఓ వన్ తో మాట్లాడమని  ఎం ఈ ఓ రమేష్  చెప్పడం రమేష్ తో మాట్లాడమని ఇంకొక చెప్పడం ఇలా కాలం గడుపుతున్నారని ప్రైవేట్ కార్పొరేటర్ విద్య సంస్థలపై చర్యలు తీసుకోవాలి.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *