PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క‌ర్నూలు ప్రజ‌ల‌కు అవినీతి లేని పాల‌న అందిస్తా.. టిడిపి ఇంచార్జి టి.జి భ‌ర‌త్

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  క‌ర్నూల్లో అవినీతి లేని పాల‌న అందిస్తాన‌ని క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భ‌ర‌త్ అన్నారు. క‌ర్నూలు న‌గ‌ర శివారులోని అశోక ఉమెన్స్ ఇంజినీరింగ్ క‌ళాశాల‌లో ఆయ‌న విద్యార్థుల‌తో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. యువ‌త క‌ల‌లు సాకారం కావాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల‌న్నారు. విజ‌న్ ఉన్న చంద్రబాబు నాయ‌క‌త్వంలో క‌ర్నూలుకు ఒక విజ‌న్ పెట్టుకొని తాను రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన‌ట్లు చెప్పారు. తాను గెలిచిన త‌ర్వాత క‌ర్నూలుకు తీసుకొచ్చే ప‌రిశ్రమ‌ల వ‌ల్ల భ‌విష్యత్తు త‌రాలు మొత్తం ల‌బ్ది చెందుతాయన్నారు. క‌ర్నూలు శివారులో ఉన్న ఇండ‌స్ట్రియ‌ల్ హ‌బ్‌లో ఎన్నో ప‌రిశ్రమ‌లు వ‌చ్చే అవ‌కాశం ఉందని తెలిపారు. కియా ప‌రిశ్రమ అనంత‌పురం రూపురేఖ‌లు మార్చేసిందన్నారు. యువ‌త ఆలోచించి వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌కు మ‌ద్దతు ఇవ్వాల‌ని కోరారు. యువ‌తీ, యువ‌కులు స‌బ్జెక్ట్‌తో పాటు ఇత‌ర విభాగాల‌పై కూడా ప‌ట్టు సాధిస్తే ఎలాంటి ప‌రిస్థితులు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొని జీవితంలో రాణించ‌గ‌లుగుతారన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధినేత అశోక్, తదితరులు పాల్గొన్నారు.

About Author