NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రజా ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

1 min read

నగరపాలక అదనపు కమిషనర్ ఆర్జీవి కృష్ణ

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 29 అర్జీలు

కర్నూలు, న్యూస్​ నేడు:  సోమవారం  ప్రజా ఫిర్యాదులు దృష్టికి రాగానే వాటి పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకోవాలని నగరపాలక అదనపు కమిషనర్ ఆర్జీవి కృష్ణ అధికారులకు సూచించారు. సోమవారం నగరపాలక కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి 29 అర్జీలు వచ్చాయి. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అదనపు కమిషనర్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సతీష్ రెడ్డి, మేనేజర్ చిన్నరాముడు, ప్రజారోగ్య అధికారి డాక్టర్ విశ్వేశ్వర్ రెడ్డి, ఇంచార్జీ ఎస్‌ఈ శేషసాయి, ఆర్ఓ జునైద్, ఎంఈ లీల ప్రసాద్, పారిశుద్ధ్య పర్యవేక్షక అధికారి నాగరాజు, టిడ్కో అధికారి పెంచలయ్య, తదితరులు పాల్గొన్నారు.వచ్చిన విన్నపాల్లో కొన్ని..వడ్డేగిరి కెవిఆర్ గార్డెన్ ప్రాంతాల్లో తమకు తాగునీటి సమస్య పరిష్కరించాలని స్థానికులు అబ్దుల్ సలాం, మహ్మద్ అహమ్మద్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఇదే సమస్యను బొంగుల బజార్ నందు ఉందని ఎం.ధరణి, జి.నాగమ్మ, సరస్వతి, పద్మ ఫిర్యాదు చేశారు.జొహరపురం ఇందిరమ్మ కాలనీ నందు డ్రైనేజీ కాలువ, వీధి దీపాలు వెలగడం లేదని స్థానికురాలు నజియ ఫిర్యాదు చేశారు.శ్రీ సిద్ధివినాయక నగర్ నందు డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేదని స్థానికులు నసీర్ బాష, సుమ, లీల తదితరులు విన్నవించారు.జివో నెంబర్ 5 ను సవరించాలని కోరుతూ సచివాలయ ఉద్యోగులు వినతిపత్రం సమర్పించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *