PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తెలంగాణలోకి రాహుల్ యాత్ర !

1 min read

పల్లెవెలుగువెబ్ : ‘భారత్ జోడో యాత్ర’ ఆదివారం తెలంగాణలోకి ప్రవేశించింది. మక్తల్ దగ్గర కృష్ణా బ్రిడ్జి పైనుంచి రాహుల్ గాంధీ రాష్ట్రంలోకి అడుగుపెట్టారు. పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధుయాష్కీ తదితరులు, కార్యకర్తలతో కలిసి రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలికారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా బతుకమ్మలు, బోనాలు, డోలు వాయిద్యాలతో రాహుల్ ను స్వాగతించారు. అనంతరం నాయకులు, కార్యకర్తలంతా రాహుల్ గాంధీతో కలిసి నడిచారు.

About Author