PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నేటి నుంచే రాహుల్ యాత్ర ప్రారంభం

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కాంగ్రెస్‌ పునరుజ్జీవానికి, ప్రజలతో తిరిగి మమేకం కావడానికి ఆ పార్టీ తలపెట్టిన ‘భారత్‌ జోడో యాత్ర’ బుధవారం తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభం కానుంది. ఆ పార్టీ అగ్ర నేత రాహుల్‌గాంధీ దీనికి శ్రీకారం చుట్టనున్నారు. శ్రీనగర్‌ వరకు మొత్తం 3,570 కిలోమీటర్ల మేర సాగే ఈ యాత్ర ఆసాంతం ఆయన స్వయంగా పాల్గొంటున్నారు. ఐదు నెలల పాటు 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతా(యూటీ)ల గుండా సాగే పాదయాత్రలో ఆయన వెంట 119 మంది సీనియర్‌ నేతలు నడుస్తారు. వీరంతా కన్యాకుమారి నుంచి శ్రీనగర్‌ వరకు రాహుల్‌ వెంటే ఉంటారు. రాహుల్‌ మంగళవారం రాత్రి ఢిల్లీ నుంచి విమానంలో చెన్నై చేరుకున్నారు.

                                             

About Author