PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రంజాన్ తోఫా పంపిణీ చేసిన టిజి భరత్

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: రంజాన్ పండుగను ముస్లీం సోదరులందరూ ఆనందంగా జరుపుకోవాలని కర్నూలు నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జ్ టిజి భరత్ అన్నారు. నగరంలోని 11,12 వార్డులకు చెందిన ముస్లీం కుటుంబాలకు ఖాన్ బ్రదర్స్ ఆధ్వర్యంలో టిజి భరత్ చేతుల మీదుగా రంజాన్ తోఫా పంపిణీ చేశారు. నెల రోజులకు సరిపడా నిత్యవసర సరుకులను దాదాపు 1500 కుటుంబాలకు పంపిణీ చేయడం జరిగింది. అనంతరం టీజి భరత్ మాట్లాడుతూ… కర్నూలులో ఖాన్ బ్రదర్స్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో రంజాన్ తోఫా పంపిణీ చేసేవారని.. దీనివల్ల ఎన్నో పేద ముస్లీం కుటుంబాలు లబ్ధి పొందాయని, రంజాన్ తోఫా విలువ ఏంటో ముస్లీం సోదర సోరీమణులకు తెలుసనన్నారు. మళ్ళీ ఇఫ్పుడు ఖాన్ బ్రదర్స్ రంజాన్ తోఫాను ముస్లీం సోదరులకు పంపిణీ చేయడం శుభపరిణామం అన్నారు. ఈ రంజాన్ తోఫా వల్ల ముస్లిం కుటుంబాలు సంతోషంగా పండుగను జరుపుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లీం సోదరులందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో ఖాన్ బ్రదర్స్ పాల్గొన్నారు.

About Author