PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాప్తాడు కోట‌కు బీటలు..?

1 min read
వైసీపీలో చేరిన టీడీపీ నాయకులు

వైసీపీలో చేరిన టీడీపీ నాయకులు

రాప్తాడు : టీడీపీ కోట‌కు బీట‌లు వారుతున్నాయా?. అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. టీడీపీ ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ అభ్యర్థులు ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్నారు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా రాప్తాడు వైసీపీలోకి చేరికలు జ‌ర‌గుతున్నాయి. భ‌య‌మో? భ‌విష్యత్తు ప్రయోజ‌నం కోస‌మో.. తెలియ‌దు కానీ.. రాప్తాడులో టీడీపీ క్యాడ‌ర్ నెమ్మదిగా వైసీపీ వైపుగా వెళ్తోంది. ఇందుకు ఉదాహ‌ర‌ణ‌.. ఇటీవ‌ల నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రుగుతున్న చేరిక‌లు. తాజాగా నియోజకవర్గంలోని ఆత్మకూరు, రూరల్ మండలాల్లోని తాటిచెర్ల, బి యలేరు గ్రామానికి చెందిన పలువురు టిడిపి కార్యకర్తలు వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలో టిడిపి ఎంపిటిసి అభ్యర్థి ఈడిగ నారాయణ కోడలు పద్మక్క వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పార్టీలోకి చేరిన వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే తోపుదుర్తిప్రకాష్​ రెడ్డి తోనే రాప్తాడు నియోజకవర్గం అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

About Author