జూన్ 4న ట్రాన్స్ జెండర్స్ కు రేషన్ కార్డులు జారి
1 min read
మార్పులు చేర్పులపై ప్రత్యేక కేంద్రం
జిల్లా పౌరసరఫరాల అధికారి కార్యాలయంలో ఏర్పాటు
జిల్లా జాయింట్ కలెక్టర్ పి దాత్రి రెడ్డి
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : జిల్లాలో ట్రాన్సజెండర్స్ రైస్ కార్డుల జారీకి జూన్, 4వ తేదీన జిల్లా పౌర సరఫరాల అధికారి కార్యాలయంలో ప్రత్యేక కేంద్రం ఏర్పాటుచేస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి చెప్పారు.ఈ కేంద్రంలో ట్రాన్సజెండర్స్ కు రైస్ కార్డులు, ఆధార్ కార్డులు జారీ,ఆధార్ కార్డులో మార్పులు,రైస్ కార్డులో కుటుంబ సభ్యులు మార్పులు,చేర్పులు,ఆధార్ కార్డులో చిరునామా,తదితర మార్పులు చేస్తారని, ట్రాన్సజెండర్స్ ఈ కేంద్రం ద్వారా అందించే సేవలు వినియోగించుకోవాలని జేసీ ధాత్రిరెడ్డి చెప్పారు.