PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మంత్రి మ‌ల్లారెడ్డి పై రెడ్ల ఆగ్ర‌హం.. స‌భ‌లోనే దాడి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : తెలంగాణ‌ కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. రెడ్ల సింహగర్జన సభలో ఆయనపై రెడ్డి కులస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌లో ఆదివారం రాత్రి జరిగిన ఈ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన మల్లారెడ్డి.. తన ప్రసంగంలో పదే పదే సీఎం కేసీఆర్‌ను, టీఆర్‌ఎ్స్ ను పొగుడుతూ మాట్లాడటం పై మండిపడ్డారు. మల్లారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇందుకు ఆగ్రహించిన మంత్రి.. మధ్యలోనే వెళ్లిపోయేందుకు ప్రయత్నించగా ఆయన వాహనంపై కుర్చీలు, వాటర్‌ బాటిళ్లతో దాడి చేశారు. దీంతో సభలో ఉద్రిక్తత నెలకొంది. తొలుత మల్లారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను ఏకరవు పెట్టారు. అయితే రూ.5 వేల కోట్లతో ఏర్పాటు చేస్తానన్న రెడ్డి కార్పొరేషన్‌ ఏమైందని సభికులు ఆయనను ప్రశ్నించారు.

                                 

About Author