PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆగస్టులో రిలీజ్..

1 min read

సినిమా డెస్క్​: కరోనా సెకెండ్ వేవ్ తర్వాత నేటి నుంచి థియేటర్స్ రీ ఓపెన్ అవుతున్న సంగతి తెలిసిందే. దీంతో షూటింగ్స్ తో సహా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకుని ఒక్కో మూవీ రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి. ఇప్పటికే పలు సినిమాల రిలీజ్ డేట్స్ ప్రకటించేశారు దర్శకనిర్మాతలు. సందీప్ కిషన్ కూడా తన కొత్త మూవీతో వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో సందీప్ నటించిన చిత్రం ‘గల్లీ రౌడీ’. కోన వెంకట్‌ సమర్పణలో ఎంవీవీ సత్యనారాయణ నిర్మిస్తున్నారు. నేహా శెట్టి హీరోయిన్. రాజేంద్ర ప్రసాద్, బాబీ సింహా, పోసాని కృష్ణమురళి, వెన్నెల కిశోర్ కీలకపాత్రలు పోషించారు. పోస్ట్ ప్రొడక్షన్ లో భాగంగా ఈ మూవీ రీసెంట్‌గా సెన్సార్ పూర్తిచేసుకుని ‘యు/ఎ సర్టిఫికేట్ అందుకున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘ ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే సినిమా కూడా హిలేరియస్ ఎంటర్ టైనర్ గా ఉంటుంది. ఆగస్టులో సినిమా రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నాం. త్వరలోనే డేట్ కూడా అనౌన్స్ చేస్తాం’ అన్నారు. తనకి ఇష్టం లేకపోయినా వారసత్వంగా రౌడీయిజం చేసే పాత్రలో కనిపించనున్నాడు సందీప్ కిషన్. ఈ సినిమా ప్రేక్షకులకు నవ్వుల విందుగా ఉంటుందని సందీప్ చెప్పడంతో ఈ మూవీపై ఎక్స్‌పెక్టేషన్స్‌ బాగానే ఉన్నాయి.

About Author