PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పత్తికొండ రహదారులను బాగు చేయండి 

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: బుధవారం  అఖిలభారత యువజన సమైక్య ఏ ఐ వై ఎఫ్  ఆధ్వర్యంలో పత్తికొండ సమీపంలోని రోడ్లను మరమ్మత్తు చేయాలని రోడ్ల నిర్మాణ శాఖ అధికారి కార్యాలయానికి అతికించి నిరసన తెలిపారు..కార్యాలయం లో అధికారులు ఎవరూ లేనందున  ఆఫీసు గోడకు అతికించి నిరసన కార్యక్రమం చేపట్టారు. పత్తికొండ నుండి ఆదోనికి వెళ్ళే ప్రథాన రహదారిలోఅనేకచోట్ల గుంతలు ఏర్పడ్డాయని, వాటిని మరమ్మతు చేయాలని కోరారు. అదేవిధంగా పత్తికొండ నుండి ఎద్దుల దొడ్డి గ్రామం 5 కిలోమీటర్ రాయి దగ్గర ఏర్పడిన పెద్ద గుంత వలన రాత్రిపూట వాహనదారులకు తీవ్ర ఇబ్బందికరంగా మారిందన్నారు. దీనిపై తక్షణమే అధికారులు స్పందించి మరమ్మతులు చేయాలని కోరారు. లేనియెడల అఖిల భారత యువజన సమైక్య ఆందోళనలకు దిగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ తాలూకా ప్రధాన కార్యదర్శి కే హనుమేష్, తాలూకా అధ్యక్షులు పెద్దయ్య, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు అల్తాఫ్, రాము, రంగస్వామి, రవి తదితరులు పాల్గొన్నారు.

About Author