NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రజా సమస్యలను వేగవంతంగా పరిష్కరించండి

1 min read

పిజిఆర్ఎస్ లో వచ్చిన దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలి

లాగిన్ లో వచ్చిన అర్జీలను ఎప్పటికపుడు చూడాలి

ఏ ఒక్క అర్జీ కూడా బియాండ్ ఎస్ఎల్ఏ వెళ్లకూడదు

జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య

కర్నూలు, న్యూస్​ నేడు: పిజిఆర్ఎస్ లో వచ్చిన ప్రజా సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసెల్ సిస్టమ్ – పిజిఆర్ఎస్) కార్యక్రమం ద్వారా జాయింట్ కలెక్టర్ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.ఫిర్యాదుల స్వీకరణ అనంతరం జాయింట్ కలెక్టర్ ఫిర్యాదుల పరిష్కారాల పై అధికారులతో సమీక్షించారు.. పిజిఆర్ఎస్ లో వచ్చిన దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని బియాండ్ ఎస్ ఎల్ ఏ వెళ్లకుండా చూడాలని జాయింట్ కలెక్టర్ తెలిపారు.. లాగిన్ లో వచ్చిన అర్జీలను ఎప్పటికపుడు చూడాలని ఎట్ టూ వ్యూ లో ఏ ఒక్క అర్జీ కూడా ఉండకూడదన్నారు.సిఎంఓ గ్రీవెన్స్ కు సంబంధించి ఆదోని సబ్ కలెక్టర్ వద్ద 7, కర్నూలు ఆర్డీఓ  వద్ద 4,  పత్తికొండ ఆర్డీఓ వద్ద 3, కలెక్టరేట్ ఏఓ వద్ద 3, సర్వే ఏడి , విద్య శాఖ, పశుసంవర్థక శాఖ  , డిఆర్డిఏ పిడి ల వద్ద ఒక్కొక్క దరఖాస్తు చొప్పున పెండింగ్ లో ఉన్న వాటిని బియాండ్ ఎస్ఎల్ఎ వెళ్లకుండా పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు.కార్యక్రమంలో ఇంచార్జి డిఆర్ఓ వెంకటేశ్వర్లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అనురాధ, జిల్లా పరిషత్ సీఈఓ నాసర రెడ్డి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *