భూ నష్ట పరిహారం అందజేసిన రెవెన్యూ అధికారి
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు జిల్లా కలెక్టరు వారు భూ నష్ట పరిహారము రూపాయలు సుమారు 67 లక్షల రూపాయలు విడుదలచేసి సదరు భూ నష్ట పరిహారమును కక్షి దారులకు అందజేయవలసిందిగా ఉత్తర్వులు జారి చేసియున్నారు. కావున, వారి ఆదేశముల మేరకు అల్ట్రా మెగా సోలార్ ప్రాజెక్ట్ కొరకు సేకరించిన భుములకి సంభందించిన భూ నష్ట పరిహారమును ఈ రోజు అనగా 25.06.2025 తేదిన కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలము శకునాల గ్రామస్తులకు యన్.జి.శ్రీనివాసులు మరియు ఇతర ముగ్గురికి భూ నష్ట పరిహారము కే.సందీప్ కుమార్, రెవెన్యూ డివిజినల్ అధికారి, కర్నూలు వారు అందజేయడము జరిగినది.