PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గుజ‌రాత్ లో మ‌ళ్లీ అల్ల‌ర్లు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : గుజరాత్ రాష్ట్రంలో మళ్లీ సోమవారం రాత్రి అల్లర్లు చెలరేగాయి. వడోదర నగరంలోని సున్నిత ప్రాంతం మీదుగా సోమవారం రాత్రి గణేష్ విగ్రహాన్ని సున్నిత ఊరేగింపుగా తీసుకువెళుతుండగా రెండు వర్గాల వారు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. గణేష్ విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకువెళుతుండగా రాళ్లు రువ్వుకున్న ఘటనతో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. గణేష్ విగ్రహాన్ని శాంతియుతంగా మండపం వద్దకు తరలించారు. రాళ్లు రువ్వుకున్న ఘటనపై రెండు వర్గాలకు చెందిన 13మందిపై కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నామని వడోదర పోలీసులు చెప్పారు.

                                                           

About Author