PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆర్టీసీ బస్సు – బొలెరో వాహనం ఢీ :  ఇద్దరు మృతి

1 min read

పల్లెవెలుగు వెబ్​, నందికొట్కూరు: కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం దామగట్ల అంచె వద్ద శుక్రవారం  తెల్లవారు జామున ఆర్టీసీ బస్సు, బొలెరో వాహనం  ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బొలెరో వాహనం  డ్రైవర్ స్వామి రెడ్డి అక్కడికక్కడే చ‌నిపోయారు. మరో వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మృతులు కోసిగి మండలానికి చెందిన‌వారిగా తెలుస్తోంది.వీరు ఎండు మిరపకాయ ను గుంటూరులో విక్రయించి తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది .సంఘటన స్థలానికి చేరుకున్న బ్రాహ్మణకొట్కూరు ఎస్ ఐ ఓబులేషు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

About Author