PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మందు బాటిళ్ల కోసం నంద్యాల‌లో ప‌రుగో ప‌రుగు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా ఆత్మకూరులో మద్యం లోడుతో వెళ్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పండింది. ఈ ప్రమాదంలో వాహనంలోని మద్యం బాటిళ్ళన్ని నేల పాలయ్యాయి. ఇంకేముంది.. ఇది గమనించిన మందుబాబులు వాటిని ఎత్తుకెళ్లేందుకు ఎగబడ్డారు. వాళ్ల స్నేహితులకు కాల్‌ చేసి వాళ్లను రమ్మన్నారు. దొరికిన కాడికి దొరికినన్నీ తీసుకుని పరుగో పరుగు. వాహనం ప్రమాదానికి గురైన సంఘటనను ఆదమరిచి కనీసం ప్రమాద సమయంలో డ్రైవర్ ఎలా ఉన్నాడో కూడా పట్టించుకోలేదు. అందులోనూ కళ్ల ముందు కావాల్సినన్నీ బ్రాండ్‌లు కనిపిస్తే కన్నుమిన్ను ఆగుతుందా..! మందు తర్వాతే ఏదైనా అన్నట్లుగా మందు బాబులు వ్యవహరించిన తీరుకు అందరూ ఆశ్చర్యపోయారు.

                                     

About Author