PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మిడ్ నైట్ మీటింగ్స్ లో సాయిరెడ్డి దిట్ట !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ హైదరాబాద్‌లో మేధావులు, పత్రికా యజమానులతో సమావేశం కావడాన్ని తప్పుబట్టిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే వ్యక్తిగా రాహుల్‌గాంధీ.. తెలంగాణకు చెందిన మేధావులను, సామాజిక కార్యకర్తలను, పత్రికా యజమానులను ప్రజాస్వామ్య బద్ధంగా కలిశారని తెలిపారు. 22 కేసుల్లో నిందితుడైన అవినీతిపరుడు విజయసాయిరెడ్డికి ఈ సమావేశాలపై మాట్లాడే అర్హతలేదని అన్నారు. అవినీతిపరుడైన విజయసాయిరెడ్డి అర్ధరాత్రి సమావేశాలు నిర్వహించడంలో దిట్ట అని అన్నారు. అవినీతిపరులకే రాహుల్‌ సమావేశాల్లో కుట్ర కనిపిస్తుందని, ప్రగ తిశీలంగా ఆలోచించే వారికి ఇది అవమానకరమని విమర్శించారు.

                                    

About Author