PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సజ్జల  కాంగ్రెస్ పట్ల చిల్లర మాటలు మానుకోవాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సలహాదారు సజ్జల  కాంగ్రెస్ పట్ల చిల్లర మాటలు మానుకోవాలి.  ఏపీ సి సి కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి ఎం అమానుల్లా. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న విలేకరుల సమావేశంలో అమాయకుడైన వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన సోనియాగాంధీ అక్రమ కేసులు పెట్టిందని అనడం విడ్డూరంగా ఉందని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కర్నూలు జిల్లా సహాయ కార్యదర్శి ఏం అమానుల్లా ఒక ప్రకటనలో ఖండించారు. ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేస్తున్నారని జగన్ పై ప్రైవేట్ కంప్లైంట్ వేశారని దానిపై సిబిఐ ఈడి దర్యాప్తు చేసి కొన్ని వందల కోట్లు జగన్ ఆస్తులు అటాచ్ చేసిన మాట వాస్తవం కాదని సజ్జలను అమానుల్లా ప్రశ్నించారు… సిబిఐ ఈడి కేసులు 31 కేసులు జగన్ పై ఉన్నాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు ఈ పదేళ్లలో కాంగ్రెస్ సోనియాగాంధీ అధికారానికి దూరంగా ఉన్నారని… మీకు ఏమి వ్యక్తిగత బలహీనతలు ఉంటే. 31 మంది వైసీపీ ఎంపీలు ఉన్న ప్రత్యేక హోదా కోసం ఎందుకు నిలదీయడం లేదని సజ్జలను అమానుల్లా ప్రశ్నించారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పార్లమెంట్లో ఎన్ని బిల్లులు పెట్టిన బీ జేపీకి గుడ్డిగా మద్దతు ఇస్తున్న జగన్కు ఈ పది సంవత్సరాలలో క్లీన్ చీట్ ఎందుకు రాలేదు సజ్జల చెప్పాలని అమానుల్లా డిమాండ్ చేశారు. ప్రభుత్వ సలహాదారుడు సలహాదారుడుగా ఉండాలని సోనియా గాంధీ పై అ వాకులు చావాకులు పేలితే ఊరుకునేది లేదని రాబోయేది కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అని. ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీకి మన అధ్యక్షులు శ్రీ గిడుగు రుద్రరాజు గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించబోతుందని అమానుల్లా ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు పాల్గొనడం జరిగింది.

About Author