PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దూదేకుల కులస్తులకూ ‘పీఎం విశ్వకర్మ’ వర్తించేలా చూడండి

1 min read

– కేంద్రమంత్రి భగవంత్‌ను కోరిన ‘ఆకుమళ్ల నాని’

పల్లెవెలుగు వెబ్  విజయవాడ : దూదేకుల కులస్తులకూ పీఎం విశ్వకర్మ పథకం అందేలా చూడాలని కేంద్ర మంత్రి భగవంత్‌ ఖుబాను  ఉభయ రాష్ట్రాల యం బి సి గౌరవ అధ్యక్షులు డాక్టర్‌ ఆకుమళ్ల నాని విజ్ఞప్తి చేశారు. విజయవాడ రైల్వే ఫంక్షన్‌ హాల్‌లో పీఎం విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రారంభించేందుకు విచ్చేసిన కేంద్ర మంత్రి భగవంత్‌ను నాని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం వారిద్దరూ అనేకం అంశాలపై కొద్దిసేపు మాట్లాడుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై ప్రధాని మోడీని, ఏపీ సీఎం జగన్‌కు నాని కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో బెజవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు పాల్గొన్నారు.

About Author