PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జీఎస్టీ పై సంచ‌ల‌న తీర్పు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : జీఎస్టీ పై సుప్రీం కోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. జీఎస్టీ కౌన్సిల్ సిఫార్సులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీలు కావాలనుకుంటే వేర్వేరు చట్టాలు చేసుకోవచ్చని తెలిపింది. పన్నుల విషయంలో 246 ఏ ప్రకారం కేంద్రం, రాష్ట్రం సమానమని, ఒకరి ఆదేశాలను మరొకరిపై బలవంతంగా రుద్దొద్దని జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తేల్చి చెప్పింది. కేంద్ర, రాష్ట్రాలకు సమాన అధికారాలున్నాయని చెబుతూనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చలు అవసరమని సూచించింది.

                                     

About Author