PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చలివేంద్రం ఏర్పాటు.. వారంలో ఒకరోజు మజ్జిగ

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు జిల్లా కల్లూరు మండలం పాణ్యం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ వై బజార్ గారి ఆధ్వర్యంలో శ్రీ శ్రీ చిన్నటేకూరు ఆంజనేయస్వామి ఆశీస్సులతో జనసేన చలివేంద్రమును పాణ్యం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ చింతా సురేష్ బాబు గారు ముఖ్య అతిథిగా హాజరై చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా బజారి గారు మాట్లాడుతూ వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజల దాహామ్ తీర్చేందుకు గత 8 సంవత్సరముల నుండి చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ ప్రాంతంలో సుమారు 20 గ్రామాలకు వెళ్లే ప్రయాణికులు కలుస్తున్నారని మధ్యాహ్న సమయంలో నీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దీంతో ఉచితంగా చలివేంద్రం ప్రారంభించామన్నారు. వారంలో ఒకరోజు మజ్జిగ మరొక రోజు బెల్లం పానకం మిగతా రోజులు మినరల్ వాటర్ అందుబాటులో ఉంచుతామని, అందరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార విభాగ కమిటీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ తెలుగు గోవిందరాజు గారు, రాయలసీమ కోఆర్డినేటర్ శ్రీమతి హసీనా బేగం గారు, వెంకటసుబ్బయ్య సార్ గారు, సతీష్ గారు, బి.నాగరాజ్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, నియోజకవర్గ జనసేన నాయకులు హుసేన్, రంగస్వామి, ఎల్లా రాముడు, బి.అంజి, జి.శివ, తిమ్మరాజు, షేక్షావలి మరియు గ్రామ జనసైనికులు కార్యకర్తలు వీర మహిళలు పాల్గోనడం జరిగింది.

About Author