PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సొసైటీలు రైతులకు మెరుగైన సేవలు అందించాలి..

1 min read

వంద సంవత్సరాలు చరిత్ర కలిగిన సొసైటీ సేవలు అభినందనీయం..

శాసనసభ్యులు ఆళ్ల నాని

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా :  శనివారపేట సొసైటీ నూతన చైర్మన్ గా కంది రంగబాబు ప్రమాణ స్వీకారం.ఏలూరుస్థానిక  శనివారపేట విశాల సహకార సంఘ చైర్ పర్సన్ గా శనివారపుపేటకు చెందిన కంది రంగబాబు సోమవారం ఉదయం పదవీ ప్రమాణం చేశారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఉపముఖ్యమంత్రి , శాసనసభ్యులు ఆళ్ల నాని పాల్గొన్నారు. ముందుగా ఆళ్ళనాని సమక్షంలో చైర్ పర్సన్ గా రంగబాబు ప్రమాణ స్వీకారం చేశారు.ఈసందర్భంగా ఆళ్ల నాని మాట్లాడుతూ శనివారపేట సొసైటీ వంద సంవత్సరాలు చరిత్ర కలిగినదన్నారు. వందేళ్లుగా రైతుల అభివృద్ధికి కోటాను కోట్ల రూపాయలు ఋణాలుగా అందించిందని చెప్పారు. మరో  ముఖ్య అతిదిగా విచ్చేసిన నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు మాట్లాడుతూ చైర్ పర్సన్ గా ప్రమాణ స్వీకారం చేయడం అభినందనీయమన్నారు. తొలుత సొసైటీ ఆవరణలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. అనంతరం సొసైటీ చైర్మన్ కంది రంగబాబు మాట్లాడుతూ సొసైటీతో పాటు రైతుల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఇంకా ఈకార్యక్ర మంలో  ఏఎంసీ చైర్మన్ చిరంజీవి, నగర డిప్యూటీ మేయర్లు   నూకపెయ్యి సుధీర్ బాబు, శ్రీనివాస్  కార్పొరేటర్లు గుడిపూడి శ్రీనివాస్, అద్దంకి హరిబాబు పాల్గొన్నారు.

About Author