NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బాధితులకు సంఘీభావం..

1 min read

పల్లెవెలుగు వెబ్ విజయవాడ : కృష్ణాజిల్లా, ఉంగుటూరు మండలం, ఆత్కూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో రైతుల డిపాజిట్లు చెల్లించాలంటూ బాధితులు చేపట్టిన దీక్షలు నాల్గవ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ మైనార్టీ విభాగం నేషనల్‌ వైస్‌ చైర్మన్‌ జమీల్‌ అహ్మద్‌ బేగ్‌ వారికి సంఘీభావం తెలిపి, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఆత్కూరు సొసైటీలో అవకతవకలు జరిగి నెలలు గడుస్తున్నా ప్రభుత్వం, అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. బాధితులకు న్యాయం జరిగే వరకూ అండగా ఉంటామని జలీల్‌ అహ్మద్‌ బేగ్‌ మద్దతు తెలిపారు. సీఎం జగన్‌మోహనరెడ్డి తక్షణమే ఈ విషయంపై స్పందించి బాధితులకు న్యాయం చేసేలా తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

About Author