PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

SONY-ZEE సంస్థ‌ల‌ విలీనం ఖ‌రారు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : సోనీ- జీ ఎంట‌ర్ టైన్మెంట్ సంస్థ‌ల విలీనం ఖ‌రారైంది. క‌చ్చిత‌మైన విలీన ఒప్పంద ప‌త్రాల పై రెండు కంపెనీలు సంత‌కాలు చేశాయి. దాదాపు 90 రోజులు జ‌రిగిన చ‌ర్చ‌ల్లో ఇరువ‌ర్గాల‌కు ల‌బ్ధిచేకూర్చేలా నిబంధ‌న‌లు ఖ‌రార‌య్యాయి. దీంతో రెండు సంస్థ‌ల ఆస్తులు, కార్య‌క‌లాపాలు ఒకే గొడుగు కింద‌కు రానున్నాయి. ఇకపై దేశంలోనే అతిపెద్ద ఎంటర్‌టైన్‌మెంట్‌ నెట్‌వర్క్‌గా జీ-సోనీ విలీనానంతర సంస్థ అవతరించే అవకాశం ఉందని చెబుతున్నారు. విలీన సంస్థకు జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ పునిత్‌ గోయెంకా సారథ్యం వహించేందుకు జీ బోర్డు అంగీకారం తెలిపింది. దేశంలోని రెండు ప్రముఖ మీడియా వ్యాపారాల కలయికతో దేశవ్యాప్తంగా వినియోగదారులకు సినిమాల నుంచి క్రీడల వరకు కంటెంట్‌పరంగా ఎంతో ప్రయోజనం కలగనుంది.

                                 
   

About Author