PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

లోకేష్ బాబు పాదయాత్రకు విశేష స్పందన

1 min read

– సంఘీబావం తెలిపిన టి డి పి నాయకులు శ్రీసుగవాసి ప్రసాద్ బాబు

పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీనారాలోకేష్ బాబు గారు చేపట్టిన యువగళం పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని రాయచోటి తెలుగుదేశం పార్టీ నాయకులు తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ పాలకవర్గ సభ్యులు శ్రీసుగవాసి ప్రసాద్ బాబు గారుపెర్కొన్నారు. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలో 36వ రోజు కొన సాగుతున్న లోకేష్ బాబు పాదయాత్రకు రాయచోటి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నాయకులు సుగవాసి ప్రసాద్ బాబు తో పాటు తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు,అభిమానులు తో కలిసి సంఘీభావం తెలియజేసి పాదయాత్రలో పాల్గొన్నారు.రాబోవు ఎన్నికలలో చంద్ర బాబు నాయుడు సీఎం గా గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కష్టపడలన్నారు.రాష్ట్రం కుదుట పడాలన్న అభివృద్ధి చెందాలన్న,బడుగు బలహీనర్గాలకు న్యాయం జరగాలంటే చంద్ర బాబు నాయుడు గారిని గెలిపించుకోవాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందన్నారు.మన్నేరు రామాంజనేయులు,బడిశెట్టి రవి,మనోహర్,వాకా వాసు,ముని,జనార్ధన్, రామంజులునాయుడు,కోటి,తదితరులు పాల్గొన్నారు.

About Author