PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రీ సర్వే పనులు వేగవంతం చేయండి: సబ్ కలెక్టర్

1 min read

పల్లెవెలుగు వెబ్​ గోనెగండ్ల: గోనెగండ్ల మండల కేంద్రమైన గోనెగండ్ల లోని స్థానిక మండల తహసీల్దార్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్, మండల తహసిల్దార్ వేణుగోపాల్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన వీఆర్వో సర్వేర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల తహసిల్దార్ కార్యాలయంలోని శాశ్వత భూహక్కు రికార్డులను పరిశీలించి పరిశీలించి గ్రామాల వారిగా సర్వే పనితీరుపై భూ సమస్యలపై వీఆర్వో, సర్వేర్ లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆదోని డివిజన్ గోనెగండ్ల మండలంలో భూ రీ సర్వే పనులు చేస్తున్న సిబ్బంది పనితీరును పనితీరును వాటి రికార్డులను ఆయన పరిశీలించారు అలాగే ఇప్పటివరకు శాశ్వత భూహక్కు పత్రాలు మండలంలో 8 గ్రామాల్లో 100% పూర్తి చేసినందుకు సిబ్బందిని అభినందించారు అలాగే 8 గ్రామాలలో భూ రీ సర్వే భూ శాశ్వతం బుహక్కు పత్రాల పంపిణీ ఇలాంటి సమస్యలు లేకుండా ప్రజలతో కలిసి పూర్తి చేయాలన్నారు . అలాగే ఇప్పటివరకు మీరు చేసిన పనిని ఆన్లైన్లో త్వరితగతిన నమోదు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్వేలు వీఆర్వోలు తదితరులు పాల్గొన్నారు.

About Author