PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చౌడమ్మ వీధిలో వేగవంతంగా పనులు

1 min read

అడగ్గానే పనులు ప్రారంభం- హర్షం వ్యక్తం చేస్తున్న స్థానిక ప్రజలు

ఎమ్మెల్యే కి ఫోన్ లో కృతజ్ఞతలు తెలియజేసిన కాలనీవాసులు
పల్లెవెలుగు , వెబ్​ చెన్నూరు : వనం వీధిలో గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమంలో మన యువనాయకుడు పోచంరెడ్డి నరేన్ రామాంజులరెడ్డి ని చౌడమ్మ వీరికి చెందిన వార్డు ఇంచార్జ్ సాదు విజయ్, డీలర్ శీను, స్థానిక ప్రజలు డ్రైనేజీ కి ఇబ్బందిగా ఉందని కోరగా అయన వెంటనే ఆ పనుల కు సంబంధించి పంచాయతీ కార్యదర్శి రామసుబ్బారెడ్డి కి, అలాగే సర్పంచ్ సిద్ది గారి వెంకట సుబ్బయ్య కు తెలియజేయడం జరిగింది, కాగా ఆ పనులను కమలాపురం శాసనసభ్యులు పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, ఆయన తనయుడు చింతకొమ్మదిన్నె జెడ్పిటిసి నరేన్ రామాంజనేయులు రెడ్డి ఆదేశాల మేరకు గురువారం గ్రామ పంచాయతీ నిధులతో గ్రామ సర్పంచ్ , అలాగే వై ఎస్ ఆర్ సి పి పార్టీ టౌన్ అధ్యక్షుడు ముదిరెడ్డి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పంచాయతీ సెక్రటరీ రామసుబ్బారెడ్డి డ్రైనేజీ పనులను వేగవంతంగా చేయించడం జరిగింది అలాగే అక్కడ పాత కరెంట్ స్తంభాలు దెబ్బతినడంతో వాటి స్థానంలో కొత్తగా 2 కరెంటు స్తంభాలు కూడా వేయించి అక్కడి ప్రజలకు కరెంటు సమస్యలను కూడా లేకుండా చేయడం జరిగింది, కరెంటు సమస్యను ట్రాన్స్కో ఎఇ రామలింగారెడ్డి దృష్టికి ముది రెడ్డి సుబ్బారెడ్డి తీసుకుపోగా ఆయన వెంటనే స్పందించి హుటాహుటిన అక్కడి స్తంభాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఎంపీటీసీ ముది రెడ్డి సుబ్బారెడ్డి తెలిపారు.
హర్షం వ్యక్తం చేసిన స్థానిక ప్రజలు: చౌడమ్మ వీధికి చెందిన బిజెపి మండల కన్వీనర్ రెడ్డి ప్రసాద్, సాదు కుమారి, మళ్లీ శ్రీరామ్మూర్తి లు కమలాపురం శాసనసభ్యులు పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డికి గురువారం ఫోన్ చేసి అడగగానే వెంటనే మా వీధి కి సంబంధించి డ్రైనేజీ పనులు, అదేవిధంగా కరెంటు స్తంభాలు ఏర్పాటు చేసినందుకు ఎమ్మెల్యే పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు, మీ ఆదేశాల మేరకు ఎంపీటీసీ ముది రెడ్డి సుబ్బారెడ్డి చొరవ తీసుకొని వెంటనే పనులు చేపట్టి పూర్తి చేయడం జరిగిందని మరొకసారి మీకు ధన్యవాదములు తెలుపుతున్నామని అక్కడి స్థానిక ప్రజలు ఎమ్మెల్యే గారికి చెప్పటం జరిగింది, అక్కడ ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని వెంటనే పనులు కూడా చేయించడం జరుగుతుందని అక్కడి ప్రజలకు ఎమ్మెల్యే హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో వైయస్సార్ సిపి నాయకులు రమేష్ రెడ్డి , సాదు కిషోర్ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.

About Author