PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఒలంపియాడ్ పరీక్షలలో శ్రీచైతన్య విద్యార్థుల ప్రతిభ

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు నగరంలోని శ్రీరామ్ నగర్ లోని శ్రీ చైతన్య పాఠశాలలో జనవరి లో విజయవాడ కు చెందిన భారత జాతీయ టాలెంట్ సెర్చ్ ఒలింపియాడ్ ( INTSO) వారు నిర్వహించిన రెండవ స్థాయి పోటీ పరీక్షలలో 188 విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని పాఠశాల ప్రధానాచార్యులు అన్నపూర్ణ తెలిపారు .సోమవారం పాఠశాలలో ఏర్పాటుచేసిన అభినందన సభకు శ్రీ చైతన్య పాఠశాలల ఏజిఎం సురేష్ ,ఆర్ఐ వి .వెంకటేష్ ముఖ్య అతిథులుగా హాజరైనారు .ఈ సందర్బంగా ఏజిఎం సురేష్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివితే ఉన్నత ఫలితాలు సాధిస్తారని చెప్పారు .ఆర్ఐ వి .వెంకటేష్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రమశిక్షణ కలిగి ఉండాలని తెలిపారు .పోటీ పరీక్షలలో ఉత్తీర్ణులైన విద్యార్థులను ఏజిఎం అభినందించారు .అనంతరం పోటీ పరీక్షలలో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేసారు .ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రధానాచార్యులు అన్నపూర్ణ ,డీన్ లోకేశ్వర రెడ్డి , ప్రాథమిక బాధ్యురాలు నాగేశ్వరి , నాగజ్యోతి ,ఉపాధ్యాయులు ,విద్యార్థులు ,తల్లిదండ్రులు పాల్గొన్నారు .

About Author