PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అంగరంగ వైభవంగా శ్రీ శ్యామల మాతాంగి దేవి నూతన విగ్రహ ప్రతిష్ట

1 min read

-విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పుష్పగిరి పీఠాధిపతి. శ్రీ విద్యా శంకరా భారతి స్వామి

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : మండలం లోని గోపవరం గ్రామం వద్ద పుష్పగిరి రోడ్డు ప్రక్కన ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన శ్రీ శ్యామల మాతాంంగిదేవి ఆలయంలో శ్రీ శ్యామల మాతాంగి దేవి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం గురువారం ఉదయం వేద పండితుల మంత్రోచ్ఛారణలతో అత్యంత వైభవంగా ఆలయ నిర్వహకులు నిర్వహించడం జరిగింది , అమ్మవారికి ఉదయం సుప్రభాత సేవ తో పాటు ప్రత్యేక పూజలు గావించడం జరిగింది, అలాగే ఆలయ నిర్వహకులు ఆలయాన్ని అతి సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది, గురువారం ఉదయం 10- 39 నిమిషాలకు పుష్పగిరి పీఠాధిపతి జగద్గురు శ్రీ శ్రీ శ్రీ అభిన ఉద్దండ విద్యా శంకర భారతి స్వామి చేతులు మీదుగా శ్రీ శ్యామల మాతాంగి దేవి యంత్ర. విగ్రహ ప్రతిష్ట అత్యంత వైభవంగా నిర్మించిన ఈ కార్యక్రమంలో మండలం నుండే కాకుండా ఇతర మండలాల నుండి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించు కోవడం జరిగింది, ఈ మేరకు ఆలయ కమిటీ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడంతోపాటు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు ఆలయ కమిటీ నిర్వాహకులు తీర్థప్రసాదాలు అన్న సంతర్పణ ఏర్పాటు చేశారు, అనంతరం వృషభ రాజులచే బండలాగుడు పోటీలు ఏర్పాటు చేసి బహుమతులు అందజేశారు. శ్రీ శ్యామల మాతంగి దేవిని దర్శించుకున్న ఎమ్మెల్యే, గురువారం శ్రీ శ్యామల మాతంగి దేవి నూతన ఆలయ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ఎమ్మెల్యే పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, ఆయన తనయుడు నరేన్ రామాంజనేయులు రెడ్డి పాల్గొని అమ్మవారి నీ దర్శించుకోవడం జరిగింది, ఆలయ నిర్వహకులు ఎమ్మెల్యే కి ఆలయ సంప్రదాయాలతో శాలువా పూలదండలతో సత్కరించి అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు.

About Author