PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌.. ప్ర‌తిప‌క్షాల అభ్య‌ర్థిగా ప‌వార్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ ఎంపికవుతారా? అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. తాజా పరిణామాలు చూస్తే పవార్‌ అభ్యర్థి అవుతారన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆయన్నే అభ్యర్థిగా నిలపాలని ఆప్‌ గట్టిగా భావిస్తోంది. ఆ పార్టీ ఎంపీ సంజయ్‌సింగ్‌ ఆదివారం సాయంత్రం 4 గంటలకు ముంబైలో పవార్‌తో సమావేశమయ్యారు. అరగంట పాటు మంతనాలు జరిగాయి. ఆయన ఎన్‌డీఏ అభ్యర్థిపై పోటీచేయాలన్నది తమ అభిమతమని ఆప్‌ వర్గాలు తెలిపాయి. దీనిపై పవార్‌, ఎన్‌సీపీ ఇంతవరకు పెదవి విప్పలేదు. అయితే ప్రతిపక్షాలు తమ అభ్యర్థిత్వంపై ఇంకా ఏకాభిప్రాయ నిర్ణయం తీసుకోకున్నా.. పవార్‌ మాత్రం సానుకూలంగానే ఉన్నట్లు తెలుస్తోంది.

                                  

About Author