ఏపీయూడబ్ల్యూజే దౌర్జన్యాలను అరికట్టండి..
1 min read
విజయవాడ ప్రెస్క్లబ్ను అందరిదిగా మార్చేందుకు సహాకరించండి..
ప్రెస్క్లబ్ పేరు చెప్పి నిధులు దారిమళ్లిస్తున్నవారిపై చర్యలు తీసుకోండి..
ప్రెస్క్లబ్లో జరుగుతున్న వ్యవహారాలపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టండి..
విజయవాడ కమిషనర్ను కలిసి వినతిపత్రం అందించిన జేఏసీ నేతలు ..
విజయవాడ, న్యూస్ నేడు: విజయవాడ ప్రెస్ క్లబ్ మాదే అంటూ ప్రెస్ క్లబ్ లోకి వచ్చే వేరే సంఘం జర్నలిస్టులను ఏపీయూడబ్ల్యూజే నాయకులు ఇబ్బంది పెడుతున్న దృష్ట్యా ప్రెస్ క్లబ్ సాధన సమితి నాయకులు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు,విజయవాడ డిసిపి ఉదయ రాణి లకు పిర్యాదు చేశారు. విజయవాడ జర్నలిస్టుల సంక్షేమం కోసం అలనాటి సీనియర్ జర్నలిస్టు పెద్దల నేతృత్వంలో జులై 1971లో అప్పుటి ముఖ్యమంత్రి దివంగత కాసు బ్రహ్మానంద రెడ్డి “ప్రెస్ క్లబ్, విజయవాడ” కు శంకుస్థాపన చేశారని, అయితే “ప్రెస్ క్లబ్” మాదే అంటున్న ఏపీయూడబ్ల్యూజే హైదరాబాద్ లో ఏప్రియల్ 1975లో రిజిస్ట్రేషన్ అయినట్టుగా డాక్యుమెంట్స్ కనబడుతున్నాయనీ సిపి దృష్టికి తీసుకెళ్లారు. 1971లో శంకుస్థాపన జరిగిన ప్రెస్ క్లబ్ 1975లో రిజిస్టర్ అయిన ఏపీయూడబ్ల్యూజే కు ఎలా చెందుతుంది… అదేవిధంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 1995లో ప్రెస్ క్లబ్ పేరు తోనే మొదటి అంతస్తును ప్రారంభించారని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రెస్ క్లబ్ లో ఉన్న 1971 శిలాఫలకంలో కానీ 1995 శిలాఫలములో కానీ ఎక్కడ కూడా ఏపీయూడబ్ల్యూజే అనుబంధమని ప్రస్తావన రాలేదన్నారు. ఇక ఏపీయూడబ్ల్యూజే చెబుతున్న ప్రెస్ క్లబ్ రిజిస్ట్రేషన్ బేలా 264 / 2018 లో ప్రెస్ క్లబ్ తమ అనుబంధం అంటూ రిజిస్ట్రేషన్ చేసుకున్నారనీ 1971లో శంకుస్థాపన జరిగిన ప్రెస్ క్లబ్ 2018 లో కొంతమంది కలిసి చేసుకున్న రిజిస్ట్రేషన్ ఎలా న్యాయ సమ్మతం అని సాధన సమితి నేతలు కమిషనర్ కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంలో గత రెండు సంవత్సరాల క్రితమే అప్పటి సబ్ కలెక్టర్ నివేదికను కలెక్టర్ కు ఇచ్చారని, అయినా ఏపీయూడబ్ల్యూజే నాయకులు కూడా మీ దృష్టికి తీసుకువచ్చారు. కాబట్టి మీరు కూడా దయచేసి నిజానిజాలు నిగ్గు తేల్చవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ప్రెస్ క్లబ్ ను తమ అదుపులో ఉంచుకున్న ఏపీయూడబ్ల్యూజే నాయకులు విజయవాడ జర్నలిస్టుల సంక్షేమాన్ని మరచి ప్రెస్ క్లబ్ డబ్బును దారి మళ్లించటమే కాక రాష్ట్ర ప్రభుత్వ వివిధ సంస్థలకు భారీగా బకాయి పడ్డారన్నారు.. అందులో భాగంగా ఇప్పటికే ఇరిగేషన్ శాఖ వారు కోటి 82 లక్షలకు పైగా కట్టాలని డిమాండ్ నోటీసిస్తూ ప్రెస్ క్లబ్ ను ఖాళీ చేయవలసిందిగా ఇరిగేషన్ శాఖ నోటిస్ ఇచ్చిందన్నారు. అదేవిధంగా ప్రెస్ క్లబ్ నిర్వాహకులుగా ఉన్న వారు వాటర్ టాక్స్ కట్టకపోతే మున్సిపల్ వారు డిస్ కనెక్ట్ చేశారని, అయితే దానిని అనధికారికంగా ఏపీయూడబ్ల్యూజే నేతలు తిరిగి నీటి చౌర్యానికి పాల్పడ్డారని నాలుగు లక్షల 50 వేలు పెనాల్టీని విధిస్తూ మున్సిపల్ వారు నోటీసు ఇవ్వడం జరిగిందన్నారు. అదేవిధంగా “ప్రెస్ క్లబ్ సొంత బిల్డింగ్” కి మాత్రమే ప్రాపర్టీ టాక్స్ మినహాయింపు జీవో వర్తిస్తుండగా వారు యూనియన్ పేరు మీద జర్నలిస్టుల సంక్షేమ మరిచి ప్రెస్ క్లబ్ ఆదాయాన్ని వాడుతున్నారని ప్రెస్ క్లబ్ ఆదాయం దుర్వినియోగం అవుతుందని వారు కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. దీనికి వారీ ఆడిటే పెద్ద ఉదాహరణ గా పేర్కొన్నారు. ప్రెస్ క్లబ్ ను విజయవాడలో ఉన్న అక్రిడేటెడ్ జర్నలిస్టులందరికి ఉపయుక్తమయ్యే విధంగా, ఏపీయూడబ్ల్యూజే ఆక్రమణ చెర లో ఉన్న “విజయవాడ ప్రెస్ క్లబ్ విజయవాడ జర్నలిస్టులందరి ప్రెస్ క్లబ్ గా నిలబడే విధంగా” మీరు విచారణ చేసి తగు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామని ప్రెస్ క్లబ్ అందరిది సాధన సమితి నాయకులు సిపిని కోరారు. సీపీని కలిసిన వారిలో విజయవాడ ప్రెస్ క్లబ్ అందరిదీ సాధన సమితి నాయకులు వీర్ల శ్రీరాం యాదవ్, మహాటివి గాంధీ, కె. ప్రసాద్ బాబు, ఎవివి శ్రీనివాసరావు, కె. నమ్మయ్య, చందన మధు, కాకుమాను వెంకట వేణు, మరీదు ప్రసాద్ బాబు, యామినేని వెంకటరమణ, అంతరాత్మ శ్రీనివాసరావు, తాళ్లూరి అనిల్, ఎన్ ఎస్ ఆర్, పసుపులేటి చైతన్య, ప్రశాంత్, మల్లిఖార్జునరావు, తాడికొండ బాలాజీ, దుర్గం ప్రతాప్, దార్ల ఉదయ్ కుమార్, సాయి, నరసింహారెడ్డి, నాగవరుణ్, బంగార్రాజా, చరణ్, వాసు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు .