PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎమ్మెల్సీ టిడిపి అభ్యర్థిగా భూమిరెడ్డిని బలపరచండి

1 min read

యూనిట్ క్లస్టర్ ఇంచార్జ్ షాబుద్దీన్
పల్లెవెలుగు, వెబ్​ ఆత్మకూరు: పట్టభద్రుల ఓటు నమోదు అవగాహన కార్యక్రమం ను టిడిపి నాయకులు పట్టణ అధ్యక్షుడు వేణుగోపాల్, టిడిపి జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు కరిముల్లా, పట్టణ ప్రధాన కార్యదర్శి అబ్దుల్లాపురం భాష ఆధ్వర్యంలో నిర్వహించారు. శనివారం పట్టణంలోని పెద్ద కబేలా లోని చైతన్య స్కూలు లొ పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి తరుపున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టభద్రులు అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకునే ముందు ప్రభుత్వ పరిపాలనను ఒకసారి గమనించాలని సూచించారు. మొదటి ప్రాధాన్యత ఓటు టిడిపి అభ్యర్థికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ తాజుద్దీన్ తో పాటు ఉపాధ్యాయులు టిడిపి నాయకులు పాల్గొన్నారు.

About Author