PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పోలీసుల అదుపులో సుబ్ర‌హ్మ‌ణ్యం కుటుంబీకులు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఎమ్మెల్సీ ఉదయ భాస్కర్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబీకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుబ్రహ్మణ్యం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు ఆయన కుటుంబ సభ్యులు అనుమతి నిరాకరించారు. రెండు రోజులుగా వైద్యులు, అధికారులు ప్రయత్నించినా సుబ్రహ్మణ్యం కుటుంబం సంతకాలు పెట్టడంలేదు. ఎమ్మెల్సీ ఉదయ భాస్కర్‎ ను అరెస్ట్ చేయాల్సిందేనని పట్టుబట్టారు. తాజాగా ఉప్పాడ కోమరగిరి లో సుబ్రహ్మణ్యం హత్య జరిగిన ప్రాంతం వద్దకు వెళ్తుండగా ఆయన భార్య.. తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని కాకినాడ తీసుకు వెళ్లి జీజీహెచ్‎ లో ఉన్న సుబ్రహ్మణ్యం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

                                          

About Author