పెదపాడు శాఖ గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరం
1 min read
ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జీవిత చరిత్ర విద్యార్థులకు వివరించారు
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : పెదపాడు శాఖా గ్రంధాలయం నందు ఉచిత వేసవి విజ్ఞాన శిబిరంలో భాగంగా గురువారం విద్యార్థిని విద్యార్థులకు రిసోర్స్ పర్సన్ కుమారి నీలాద్రి నాగపావని ఆంధ్ర కేసరి” టంగుటూరి ప్రకాశం”పంతులు జీవితచరిత్రను విపులంగా తెలియపరచి,ఈయన ది: 23/08/1872లో జన్మించినారని,ది: 20/05/1957 లు లో మరణించినారని, సుప్రసిద్ధ స్వతంత్ర సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి,నిరుపేద కుటుంబంలో పుట్టి వారాలు చేసుకుంటూ చదువుకుని ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయ్యారు. 1940,50 దశకాల్లో ఆంధ్ర రాజకీయాల్లో ప్రముఖంగా వెలుగొందిన వ్యక్తుల్లో ప్రకాశం ఒకరు, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనలో నిర్ణాయాక పాత్ర పోషించాడు, మద్రాసులో సైమన్ కమిషన్ కు వ్యతిరేక ప్రదర్శనలో తుపాకి కి ఎదురుగా గుండె నుంచి “ఆంధ్ర కేసరి’అని పేరుపొందునారు అని తెలియజేశారు.అనంతరం శ్రీమతి మాధురి రచించిన “దురాశ” పుస్తకం నుండి “చిలుక రాజు”అనే కథను విద్యార్థులచే చదివించడం, కథలు చెప్పించడం,పుస్తక సమీక్ష చేయించడం జరిగినది.తరువాత విద్యార్థిని విద్యార్థులకు “స్వర్ణాంధ్ర-2047″అనే అంశం మీద “చిత్రలేఖనా పోటీలు” నిర్వహించుట జరిగినది.ఈ కార్యక్రమమునకు 28 మంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొని నారు. ఈ కార్యక్రమం అంతయు గ్రంథాలయ అధికారి శ్రీ దుగ్గిపోగు జాన్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించుట జరిగినది.పాల్గొనిన విద్యార్థిని విద్యార్థులకు స్నాక్స్ పంచి పెట్టడం జరిగినది అని తెలియజేశారు.
