NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

తాగుబోతులకు అడ్డా సమ్మర్ స్టోరేజి ట్యాంక్

1 min read

భయపడుతున్న మహిళలు

నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు  న్యూస్ నేడు: బండి ఆత్మకూరు లోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు తాగుబోతులకు అడ్డాగా మారింది. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు పరిసరాల్లో తాగుబోతులు యదేచ్చగా మద్యం సేవిస్తూ ప్రజలకు ఇబ్బందులను కలుగజేస్తున్నారు. తెల్లారింది మొదలు రాత్రి 11 గంటల వరకు ఈ ప్రాంత పరిసరాల్లో తాగుబోతులు నిత్యం మద్యం సేవిస్తూ ఉండటం సర్వసాధారణంగా మారింది. సమ్మర్ స్టోరీ ట్యాంక్ వద్దకు త్రాగునీటిని తెచ్చుకునేందుకు మహిళలు ప్రతిరోజు ఇక్కడికి వచ్చి బిందెలతో నీళ్లు తీసుకుని వస్తూ ఉంటారు. ఈ సమయంలో తాగుబోతులు ఈ ప్రాంతంలో ఉండటంతో మహిళలు ఆందోళన చెందుతున్నారు. తాగుబోతుల వల్ల  ఎప్పుడు ఏమి జరుగుతుందోనని  మహిళలు బెంబేలెత్తి పోతున్నారు. బండి ఆత్మకూరుకు చెందిన చాలామంది యువకులు ఈ ప్రాంతానికి చేరుకొని మద్యం మత్తులో మునిగి తేలుతున్నారు. మద్యం సేవించిన అనంతరం తాగిన ఖాళీ సీసాలను ఫిల్టర్ బెడ్ లలో పడ వేస్తూ ఉన్నారు.మ ద్యానికి  బానిసలైన యువకులు ఇంటివద్దల డబ్బుల కోసం మహిళలను హింసిస్తూ ఉన్నారు. మరి కొందరు వ్యక్తులు త్రాగి వచ్చి ఇంటి వద్ద గొడవలు సృష్టిస్తూ భార్యలను చితకబాదుతూ ఉండటం కూడా సర్వసాధారణంగా మారింది.  సమ్మర్ స్టోరేజ్ పరిసరాలతో పాటు  అక్కడ ఉన్న గడ్డివాము కల్లాలలో సైతం మద్యం సేవిస్తూ ఉన్నారు. సమ్మర్ స్టోరేజ్  ట్యాంకు నిర్వాహకులు ఇక్కడ జరుగుతున్న వ్యవహారాలను గురించి పట్టించుకోవడంలేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక అధికారుల సంగతి అయితే సరే సరి. పోలీసులు సమ్మర్ స్టోరేజ్ స్టాంక్ వైపు దృష్టి సారించి తాగుబోతుల చర్యలను అరికట్టాలని  మహిళలు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రత్యేకించి ప్రాంతంలో పోలీసులు నిఘా వేయాలని కూడా మహిళలు కోరుతున్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *