PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పల్లెవెలుగువెబ్​, హైదరాబాద్: ఏడో టీ20 ప్రపంచకప్ కోసం సర్వం సిద్ధమైంది. యూఏఈ (UAE) వేదికగా 16దేశాలు, 45మ్యాచులతో నేటి నుంచి టీ20 ప్రారంభమయింది. టీ20 టోర్నీలో ప్రారంభ మ్యాచ్​లో అతిథ్య జట్టు ఒమన్​ బోణి కొట్టింది. ఆదివారం పపువా న్యూ గినియా(పిఎన్​జి)జట్టుపై ఒమన్​ జట్టు ఘన విజయం సాధించింది. పిఎన్​జి 20ఓటర్లలో 9వికెట్లు కోల్పోయి 130పరుగులు చేసింది. అనంతరం ఒమన్​ ఓపెనర్లు అకిట్​ ఇలియాస్​(50), జతిందర్​సింగ్​(73) చలరేగి ఆడి 14ఓటర్లలోనే లక్ష్యాన్ని చేధించి విజయపథానికి చేర్చారు. రెండో మ్యాచ్​లో బంగ్లాదేశ్​, స్కాట్​ల్యాండ్​ జట్లు తలపడతున్నాయి.
నవంబర్ 14 దాకా కొనసాగే టీ20 మ్యాచ్​లను ఓమన్ (Oman), దుబాయ్ (Dubai), షార్జా (Sharjah)లలో నిర్వహించనున్నారు. కొవిడ్-19 నేపథ్యంలో స్టేడియానికి 70 శాతం మంది ప్రేక్షకులనే అనుమతించనున్నారు. ఈ మ్యాచ్ లు వీక్షించడానికి వచ్చే ప్రేక్షకులు తప్పనిసరిగా కరోనా మార్గదర్శకాలు (Covid Protocall) పాటించాల్సి ఉంటుంది.

About Author