PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘ఉచిత వైద్యశిబిరం’ సద్వినియోగం చేసుకోండి:టీజీ భరత్​

1 min read

పల్లెవెలుగు వెబ్​:ప్రజలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ కర్నూలు నియోజకవర్గ ఇంచార్జి టి.జి భరత్ అన్నారు. ఆదివారం నగరంలోని 48 వ వార్డు పరిధిలోని రోజా దర్గా సమీపంలో షేర్ షా సూరి చారిటబుల్ ట్రస్ట్ ఆద్వర్యంలో ఉచిత కంటి వైద్యశిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టిజి భరత్ వైద్యశిబిరం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలు ఇలాంటి వైద్య శిబిరాల్లో తమ ఆరోగ్యానికి సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఆరోగ్యం పట్ల ఎవ్వరూ నిర్లక్ష్యంగా ఉండకూడదన్నారు. ఉచిత వైద్యశిబిరం ఏర్పాటుచేసి ప్రజాసేవ చేస్తున్న షేర్ షా సూరి చారిటబుల్ ట్రస్టు నిర్వాహకులను భరత్ అభినందించారు. ఈ వైద్యశిబిరంలో ౩౦౦ మంది వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు ఛైర్మన్ మస్సూర్ ఆలీఖాన్, శాంతిరాం కంటి వైద్యశాల ప్రతినిధులు సర్దాజ్ ఖాద్రి, దిలీప్ కుమార్, తేజశ్రీ, ట్రస్టు సబ్యులు ఖాన్ బ్రదర్స్, సద్దాం, రఫిక్, వారీష్, సిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

About Author