గ్రామాల్లో పారిశుద్ధ్యం చర్యలు ముమ్మరంగా చేపట్టండి
1 min read
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోండి
పిఆర్ వన్ యాప్ లో సరైన వివరాలు నమోదు చేయండి
స్వచ్ఛంద-స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని పెద్దఎత్తున చేపట్టండి
యోగాంధ్ర కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలి
జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా
నంద్యాల, న్యూస్ నేడు: గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా చేపట్టి జిల్లాను పరిశుభ్రంగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాలులో గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్యం, ఐహెచ్హెచ్ఎల్, సోక్ పిట్స్, కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్, చెత్త సంపద తయారీ కేంద్రాలు తదితర అంశాలపై డిఆర్ఈఓ, డిఈఈ, ఎఈ, డిప్యూటీ ఎంపిడిఓలు, ఈఓఆర్డిలు, ఎంఆర్సిలతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ సుబ్బారెడ్డి, ఇంచార్జి డిపిఓ శివారెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ మనోహర్, డ్వామా పిడి వెంకటసుబ్బయ్య, డిపిఆర్సి మంజులవాణి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఎక్కడపడితే చెత్తాచెదారం పేరుకుపోయిందని పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా చేపట్టి జిల్లాను పరిశుభ్రంగా ఉండేలా మనసు పెట్టి పనిచేయాలని ఆదేశించారు. జిల్లాలో 24 పర్యాటక కేంద్రాలున్నాయని వాటి పరిసర ప్రాంతాల్లో చెత్తాచెదారం ఉండకుండా పరిశుభ్రత చర్యలు తప్పనిసరిగా ఉండేలా చూడాలన్నారు. ట్యాంకులపైన, ఖాళీ స్థలాల్లో చెత్త వేయకుండా ఎంపిడిఓలు, ఈఓఆర్డిలు ఒక చిన్న పిట్ ను తవ్వించి చెత్తంతా ఒకచోట చేర్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి గ్రామాల్లో ట్యాంకులను పరిశుభ్రం చేసి తదుపరి పరిశుభ్రం చేయాల్సిన తేదీని కూడా ట్యాంకుపై వ్రాయాలని సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. అదే విధంగా ట్యాంకు క్లీనింగ్ రిజిస్టరు కూడా నిర్వహించి చుట్టుపక్కల ఉన్న ప్రజలచే సంతకాలు చేయించాలన్నారు. నీటిని ఎప్పటికపుడు క్లోరినేషన్ చేయాలని జిల్లాలో 20 నుండి 120 కిఎల్ సామర్థ్యం ఉన్న ట్యాంకులు ఉన్నాయని, అవసరాన్ని బట్టి నీటిలో ఎంతమేరకు బ్లీచింగ్ పౌడర్ కలపాలన్నది కూడా అవగాహన కలిగి ఉండాలన్నారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛఆంధ్రకు సంబంధించి జిల్లాలో ఇప్పటివరకు ప్రతి నెల నిర్వహించిన కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలు సేకరించి ప్రతి సచివాలయం, మండల కార్యాలయాలలో గోడకు థీమ్ ల ప్రకారం ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలని ఈఓఆర్డీలను కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా జూన్ నెలలో నీరు-మీరు అనే కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ శాఖ ఆధ్వర్యంలో పల్లె పుష్కరిణి అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అందుకు స్థానికంగా ఉన్న ట్యాంకులను పరిశుభ్రం చేయడంతో పాటు చెరువుగట్లను బలోపేతం చేసి పెద్ద ఎత్తున మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలన్నారు. యోగాంధ్రాకు సంబంధించి జూన్ 16వ తేదీన ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కార్యక్రమంలో పాల్గొనేలా చూడాలన్నారు. అందుకు అవసరమైన శిక్షణను ఇవ్వడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఉద్యోగులందరూ తప్పనిసరిగా యోగాంధ్ర యాప్ లో రిజిస్టర్ కావాలని కలెక్టర్ ఈఓఆర్డిలను ఆదేశించారుఅనంతరం పిఆర్ వన్ యాప్ ను ఓపెన్ చేసి అందులో ఈఓఆర్డిలు నమోదు చేయాల్సిన అంశాలపై కలెక్టర్ పరిశీలించారు.