PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గుంతల రోడ్ల వద్ద టిడిపి… జనసేన నేతల నిరసన

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  తెలుగుదేశం, జనసేన పార్టీల ఉమ్మడి సారధ్యంలో గుంతల ఆంధ్రప్రదేశ్ కు దారేది కార్యక్రమాన్ని కర్నూల్లో ఇరు పార్టీల నేతలు నిర్వహించారు. నగరంలోని 18 వ వార్డు పరిధిలోని జొహరాపురం నుండి ఇందిరమ్మ కాలనీకి వెళ్లే ప్రాంతంలోని గుంతల రోడ్డు వద్ద నిరసన తెలిపారు. గుంతలో ఆగిన నీటిలో నాట్లు వేశారు. ఏపీ గుంతల రాష్ట్రంగా మారిపోయిందని నినాదాలు చేశారు. ఈ ప్రభుత్వంలో అభివ్రుద్ది ఏమీ లేదన్నారు. ఏ ఊరుకు వెళ్లినా గుంతల దారులే కనిపిస్తాయన్నారు. ఇలాంటి దారుల్లో వెళితే ప్రజలు ప్రమాదాల బారిన పడతారన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో డెవలప్మెంట్ ఉంటుందన్నారు. టిడిపి, జనసేన ప్రభుత్వంలో ప్రజలకు మంచి పరిపాలన అందుతుందన్నారు. ప్రజల సమస్యలు తీరడంతో పాటు సంక్షేమం ఉంటుందన్నారు. ఇక కర్నూల్లో టి.జి భరత్ ను ఎమ్మెల్యేగా గెలిపించుకుంటేనే ప్రజలకు మంచి జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, జనసేన కర్నూలు బాధ్యులు హర్షద్, పవన్ కుమార్, అనిత శ్రీ, ఐ.టి విభాగం ఛైర్మన్ లక్ష్మీకాంత రెడ్డి, లీగల్ సెల్ ఛైర్మన్ శ్రీనివాసులు, కార్పోరేటర్ పరమేష్, వార్డు ఇంచార్జీలు గున్నామార్క్, మోహన్, గణేశ్, మహిళా నాయకురాలు చిట్టెమ్మ, తదితరులు పాల్గొన్నారు.

About Author