విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేసిన టీడీపీ నాయకులు..
1 min read
నందికొట్కూరు, న్యూస్ నేడు: మండల పరిషత్ ప్రాథమికోన్నత మరియు జిల్లా పరిషత్ పాఠశాలలు ప్రారంభమైన మొదటి రోజునే విద్యార్థులకు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయా గ్రామాల్లో పంపిణీ చేశారు. నంద్యాల పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిమాండ్ర శివానందరెడ్డి మరియు నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య ఆదేశాల మేరకు నాయకులు పంపిణీ చేశారు.గురువారం నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో 2 వ వార్డు మండల పరిషత్ ఉర్దూ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర స్టడీ మెటీరియల్ కిట్లను పట్టణ టీడీపీ నాయకులు ఎస్ఎండీ జమీల్,పాఠశాల ప్రధానో పాధ్యాయులు అబ్దుల్ సత్తార్, సనా అబ్దుల్లా,రసూల్ ఖాన్, వెంకటేష్,రఫీ,అక్రమ్ పుస్తకాలను పంపిణీ చేయగా అదే విధంగా పగిడ్యాల మండల కేంద్రంలోని మోడల్ పాఠశాలలో విద్యార్థులకు టిడిపి క్లస్టర్ ఇన్చార్జి దామోదర్ రెడ్డి, పాఠశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు, లక్ష్మాపురం టీడీపీ నాయకులు భూషి గౌడ్ పుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు చెప్పిన విధంగా విద్యార్థులు చదువుకోవాలని ఆట పాటలతో విద్యార్థులు మంచిగా చదువుకుంటూ తల్లిదండ్రులకు పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని నాయకులు విద్యార్థులకు సూచించారు.కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఈ ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని వారు అన్నారు.
