PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స్పీక‌ర్ పై కాగితాలు విసిరిన టీడీపీ ఎమ్మెల్యేలు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం ఘటన ఏపీ అసెంబ్లీలో గందరగోళం సృష్టిస్తోంది. సభ మొదలైనప్పటి నుంచి టీడీపీ సభ్యులు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. సభ్యుల ఆందోళనతో సభ ఒకసారి వాయిదా పడగా.. తిరిగి మొదలైన తర్వాత కూడా టీడీపీ సభ్యులు మునుపటి సీన్ రిపీట్ చేశారు. స్పీకర్ తమ్మినేని సీతారం పోడియం పైకెక్కి తెలుగుదేశం ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు. స్పీకర్ చైర్‌ను చుట్టుముట్టి కాగితాలు చింపి తమ్మినేనిపై విసిరేశారు. టీడీపీ సభ్యుల ఆందోళనలతో మార్షల్స్ రంగంలోకి దిగారు.

                                    

About Author