PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆ నలుగురు… వారే..

1 min read

– వృద్దురాలి అంత్యక్రియలు జరిపిన తహసీల్దార్​, సర్పంచ్​
పల్లెవెలుగు వెబ్​, గడివేముల: మండలంలో కరోన కేసులు రోజు రోజుకు పెరుగుతున్న క్రమంలో.. కుటుంబీకుల మధ్య సత్సంబంధాలు కూడా దూరమవుతున్నాయి. మండలంలోని కొరటమద్ది గ్రామంలో ఓ కుటుంబ సభ్యులందరికీ కోవిడ్​ పాజిటివ్​ వచ్చింది. వారందరూ చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆ కుటుంబంలోని 85 ఏళ్ల వృద్ధురాలు ఆకస్మికంగా మృతి చెందడంతో.. ఆమె అంత్యక్రియలు కుటుంబ సభ్యులు జరపలేని పరిస్థితి.

విషయం తెలుసుకున్న గడివేముల తహసీల్దార్​ నాగమణి దగ్గరుండి అంత్యక్రియలు జరిపి మానవత్వం చాటుకున్నారు. తహసీల్దార్​తోపాటు సర్పంచ్​ నాగేశ్వర రెడ్డి, రెవెన్యూ సిబ్బంది ఇద్దరు వృద్దురాలి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్​ మాట్లాడుతూ వృద్ధురాలి కుటుంబ సభ్యులకు కోవిడ్​ పాజిటివ్​ రావడంతో.. వారు చికిత్స పొందుతున్నారు. ఆ కుటుంబంలోని వృద్దురాలు చనిపోతే.. ఎవరూ లేరని తెలుసుకుని.. అంత్యక్రియలు జరిపించినట్లు వివరించారు.

About Author