PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నర్సాపురం ఎంపీ రఘురామకు తెలంగాణ హైకోర్టు షాక్​!

1 min read

పల్లెవెలుగువెబ్​, హైదరాబాద్​: ఏపీ నర్సాపురం వైసీపీ పార్లమెంట్​ సభ్యుడు రఘురామకృష్ణంరాజుకు తెలంగాణ హైకోర్టు షాక్​ ఇచ్చింది. తాజాగా ఆక్రమ ఆస్తుల కేసుల విషయంలో ఏపీ సీఎం జగన్​, వైసీపీ రాజ్యసభ్యుడు విజయసాయిరెడ్డిల బెయిల్​ను రద్దు చేయాలన్న షిటీషన్​ను తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. పలు సాంకేతిక కారణాల వల్ల హైకోర్టు రిజిస్ట్రీ రఘురామ పిటీషన్​ను వెనక్కి పంపారు. అక్రమ ఆస్తుల కేసు వ్యవహారంపై ఎంపీ రఘురామ గతంలోనూ దాఖలు చేసిన పిటిషన్​ను సీబీఐ కోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుత పిటిషన్​ను సైతం తెలంగాణ హైకోర్టు నిరాకరించడంతో న్యాయం కోసం చివరివరకు పోరాడుతానని ఏంపీ రఘురామరాజు పేర్కొనడం గమనార్హం.

About Author