NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బల్గేరియాలో ఘోర ఘటన.. 45 మంది సజీవ దహనం

1 min read


పల్లెవెలుగు వెబ్: యూరప్‌లోని బల్గేరియాలో ఘోర ఘటన చోటుచేసుకుంది. ఓ లగ్జరీ బస్సులో మంటలు చెలరేగి 45 మంది సజీవ దహనమయ్యారు. 52 మంది టూరిస్టులతో బస్సు బల్గేరియా రాజధాని సోఫియా నుంచి బయలుదేరింది. అయితే దారి మధ్యలో అకస్మాతుగా బస్సులో మంటలు చెలరేగాయి. కొద్ది నిమిషాల వ్యవధిలోనే మంటలు పూర్తిగా వ్యాపించడంతో బస్సు పూర్తిగా కాలిపోయింది. ఈ ఘోర ఘటనలో 45 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 12 మంది చిన్నారులు ఉండటం తీవ్రంగా కల్చివేసింది. మృతదేహాలు ఏమాత్రం గుర్తించలేని విధంగా కాలి బూడిదయ్యాయి. అయితే ప్రమాదం నుంచి 7 మంది బయటపడ్డారు. వీరి కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరుపుతామని బల్గేరియా ప్రభుత్వం ప్రకటించింది.

About Author