PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నారా లోకేష్ ను కలిసిన టిజి భరత్

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టిజి భరత్ కలిశారు. హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కలిసి లోకేష్ చేపట్టబోయే యువగళం పాదయాత్ర విజయవంతం అవ్వాలని కోరుకున్నట్లు చెప్పారు. అంతేకాకుండా పాదయాత్ర చేపట్టినన్ని రోజులు ఆయనకు సంపూర్ణం ఆరోగ్యం కలిగి ఉండాలని కోరుకున్నట్లు భరత్ తెలిపారు. టిడిపికి ప్రజల నుండి ఊహించని రీతిలో మద్దతు లభిస్తోందని చర్చించుకున్నామన్నారు. కర్నూల్లో యువతతో పాటు అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పార్టీలో చేరుతున్నట్లు వివరించినట్లు భరత్ చెప్పారు. క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రణాళికతో ముందుకు వెళుతున్నట్లు లోకేష్ తో మాట్లాడినట్లు తెలిపారు. కాగా లోకేష్ పాదయాత్రకు ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా సాఫీగా జరిగేట్లు అనుమతులు ఇవ్వాలని కోరుతున్నానన్నారు. ప్రజాస్వామ్య దేశంలో శాంతియుతంగా పాదయాత్రలు చేసే హక్కు ఎవరికైనా ఉందన్నారు.

About Author