PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హైద‌రాబాద్ లో జ‌రిగే భార‌త్, ఆసీస్ మ్యాచ్ ఏర్పాట్లు పూర్తీ

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: ఈ నెల 25న టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ కు హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియం వేదికగా నిలుస్తోంది. ఈ మ్యాచ్ కోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్టు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ వెల్లడించారు. 2,500 మంది సిబ్బందిని ఈ మ్యాచ్ కోసం వినియోగిస్తున్నట్టు తెలిపారు. ఇవాళ నాగపూర్ లో మ్యాచ్ ముగిసిన అనంతరం ఆటగాళ్లు హైదరాబాద్ చేరుకుంటారని వివరించారు. నగరంలోని రెండు హోటళ్లలో వారికి బస ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇక, ఈ మ్యాచ్ కు 40 వేల మంది వస్తారని భావిస్తున్నట్టు మహేశ్ భగవత్ తెలిపారు.

                                     

About Author