నగరంలోని ఫుడ్ ఇంజినీర్స్ కు ది బెస్ట్ నార్త్ ఇండియన్ ఫుడ్ అవార్డు
1 min read
యువ వ్యాపారవేత్త శ్రీనివాస్ కు మెమొంటో అందజేసిన సిగ్వి మేనేజర్ అఖిల్
వ్యాపార రంగంలో మరింత రాణించాలని పలువురి ఆకాంక్ష
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అనే విధంగా రాణించటం గొప్ప విషయం.ఇటు జర్నలిజంలో అటు వ్యాపార రంగంలో రాణిస్తున్న సవ్యసాచి ఉర్ల శ్రీనివాస్,ఈయనకు మరో బెస్ట్ అవార్డు లభించడం సంతోషకరమైన విషయం గా పలువురు వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు అభినందిస్తున్నారు. ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గి ఇండియా ఏలూరు నగరంలో జిల్లా కోర్టు ఎదురుగా ఉర్ల శ్రీనివాస్ నిర్వహిస్తున్న ఫుడ్ ఇంజనీర్స్ కు నగరంలోనే దిబెస్ట్ నార్త్ ఇండియన్ ఫుడ్ రెస్టారెంట్ గా ఎంపిక చేసింది. ఈ మేరకు రెస్టారెంట్ యజమాని యువ వ్యాపారవేత్త ఉర్ల శ్రీనివాస్ కు ప్రతిష్టాత్మక ది బెస్ట్ నార్త్ ఇండియన్ ఫుడ్ రెస్టారెంట్ మెమొంటోను స్విగ్గి మేనేజర్ అఖిల్ అందజేశారు.తోటి జర్నలిస్ట్ ఉర్ల శ్రీనివాస్ కు అవార్డు రావడాన్ని జర్నలిస్ట్ సోదరులు,జర్నలిస్ట్ సంఘాలు మరియు కస్టమర్లు ఆనందాలు వ్యక్తం చేస్తున్నరు. వ్యాపార రంగంలో ఇటువంటి అవార్డులు మరెన్నో భవిష్యత్తులో అందుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు.