PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చంద్రబాబు నాయుడు చొరవతో శ్రీకృష్ణ ఆలయ నిర్మాణం జరిగింది

1 min read

– వై.నాగేశ్వరరావు యాదవ్తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సమితి కన్వీనర్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: బుధవారం విజయవాడలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఈ నెల 17,18,19న నంద్యాలలో జరగబోయే శ్రీకృష్ణ దేవాలయం మరియు విగ్రహ ప్రతిష్ట కు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మాజీ మంత్రివర్యులు ఫరూక్ గారు, ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ గారు,బిటి నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సమితి కన్వీనర్వై.నాగేశ్వరరావు యాదవ్ గారు, ఏ వి ఆర్ ప్రసాద్ గారు,శివశంకర్ యాదవ్ గారు,జాతీయ బిసి సంక్షేమ సంఘము స్టేట్ జనరల్ సెక్రెటరీ విజయగౌరి యాదవ్ గారు, శేఖర్ యాదవ్ గారు,చలపతి యాదవ్ గారు, కృష్ణా యాదవ్ గారు, క్రాంతి కుమార్ గారు,మధుగారు, శ్రీనివాసులు గారు,తెలుగుదేశం పార్టీ నాయకులు, శ్రీకృష్ణ భగవానుని భక్తులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా వై.నాగేశ్వరరావు యాదవ్ గారు మాట్లాడుతూ:-తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌ., శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్థలాన్ని కేటాయించడం వల్లే శ్రీకృష్ణ ఆలయ నిర్మాణం జరిగింది.శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి యాదవ నాయకుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు. యాదవుల యొక్క రాజకీయ స్థితిగతుల గురించి చర్చించడం జరిగినది.ఈ నెల 17,18,19న నంద్యాలలో జరగబోయే శ్రీకృష్ణ దేవాలయం మరియు విగ్రహ ప్రతిష్ట వేడుకలను కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ తప్పక హాజరై ప్రతిష్ట వేడుకలను విజయవంతం చేయాగలరని ప్రార్థించుచున్నాము.

About Author